వైసీపీ, టీడీపీల నుంచి జనసేనలోకి చేరికలు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం నియోజకవర్గం నుంచి పలువురు వైసీపీ, టీడీపీలకు చెందిన నాయకులు జనసేన పార్టీలో చేరారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వీరందరికీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ యువజన విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ బిక్కిన రాజశేఖర్, వైసీపీ యువజన విభాగానికి చెందిన పోలినాటి గౌతమ్ అభిషేక్, దివిలి మాజీ సర్పంచ్ గొడత లక్ష్మి, తరాజుల పెద్దకాపు, ద్వారంపూడి చల్లారావు, కె.నాగసుబ్రహ్మణ్యం, బండి సూరిబాబు, బండి రఘుబాబు, తుమ్మలపల్లి సుజన, అమలకంటి గోవిందరాజు, మట్టా సందీప్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ తుమ్మల రామస్వామి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.


* ప్రత్యేక గీతం విడుదల
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజోలు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు డా. రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్మించిన ‘పెను పవనమే రేగెను తుపానై..’ అనే పల్లవితో కూడిన ప్రత్యేక గీతాన్ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ప్రేమస్ డార్విన్ సంగీతం సమకూర్చగా, వంశీధర్ సాహిత్యం అందించారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి బుజ్జి పాల్గొన్నారు.