ముమ్మారెడ్డి సమక్షంలో జనసేనలో చేరికలు

తెలంగాణ, కూకట్ పల్లి, కెపిహెచ్బి కాలనీ మలేషియా టౌన్షిప్ నార్త్ ఫేస్ నివసిస్తున్న మారుతి బృందం 55 మందితో బిజేపి బలపరచిన కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి బిజేపి బలపరచిన కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.