ధర్మవరం జనసేన పార్టీలో చేరికలు

ధర్మవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 36వ వార్డ్ కొత్తపేటకు చెందిన 10 కుటుంబాలు ఆదివారం జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. చేరిన వారు షేక్ మహబూబ్ బాషా, దేవరకొండ సాంబశివ, షేక్ చాంద్ భాషా, దేవరకొండ కాశి, బోయ నాగేష్, వసంతం నాగేష్, దాసరి కిరణ్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ, ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు గొట్లురు జీవి, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు, పేరూరు శ్రీనివాసులు, బండ్ల చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.