ఇసుక అక్రమ రవాణాపై జనసేన – టీడీపీల ఉమ్మడి నిరసన
పాలకొండ నియోజకవర్గం: పాలకొండ మండలంలోని గోపాలపురం గ్రామం వద్ధ ఉన్న నాగావళి నదిలో ఇసుక అక్రమ రవాణాను ఖండిస్తూ జనసేన – తెలుగుదేశం ఉమ్మడి నిరసన తెలిపారు, ఈ సందర్భంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఇరు నేతలు అనంతరం ఇసుక అక్రమ రవాణాపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఇసుక అక్రమ రవాణా వైసిపి నాయకులు కను సైగలలో జరుగుతుంది అని.. ఇసుక దందాకి వైసిపి అడ్డాగా మారిందని, ఈ విషయంపై ప్రభుత్వ పెద్దలకి తెలిసినా, స్పందించటం లేదని, ఇరు పార్టీల ముఖ్య నేతలు ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నేత, మాజీ జడ్పీటీసీ, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నిమ్మల నిబ్రమ్, నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ నిమ్మక జయక్రిష్ణ పాల్గొన్నారు. జనసేన – టిడిపి సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు పాల్గొనటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-26-at-2.55.54-PM-1024x461.jpeg)