జనసైనికుడు రాజాకు ఆర్థిక సహాయం అందించిన జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన గొలుసుపూడి రాజా గత కొంతకాలంగా రక్తహీనత ఇతర అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నారు. గొలుసు పూడి రాజా గారి ఆరోగ్య పరిస్థితులను చేబ్రోలు గ్రామ జనసైనికుల ద్వారా తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఆదివారం సాయంత్రం చేబ్రోలు గ్రామంలో గల గొలుసుపూడి రాజా స్వగృహానికి వెళ్ళి చేబ్రోలు జనసేన నాయకులతో కలిసి వెళ్లి గొలుసుపూడి రాజా ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుని జరుగుతున్న వైద్యం గురించి అడిగితెలుసు కొని గొలుసుపూడి రాజా గారి వైద్యఖర్చులు నిమిత్తం నగదును, 25 కేజీల బియ్యం, కిరాణా సామానులను అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. జనసైనికులకు ఏ విధమైన కష్టాలు వల్ల అయినా ఉపాధికి అటంకం వచ్చినప్పుడు తనకు సమస్యను తెలియజేయాలని, అటువంటి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు గ్రామ జనసేన నాయకులు జనసైనికులు వెలుబండి దొరబాబు, చేదులూరి త్రిమూర్తులు, ఓరుగంటి సత్తిబాబు, ఉలవకాయల రాంబాబు, గంటా గోపి, వెలుగుల గవ్రరాజు, లోకరెడ్డి సత్యనారాయణ, దేవర చక్రరావు, బుద్దాల మాణిక్యం, యింటి త్రిమూర్తులు, ఓరుగంటి నాగు, చేతులూరి చంటిబాబు, అల్లం దుర్గాప్రసాద్, చేదులూరి రాజా, కుక్కులూరి స్వామి, కర్రెడ్ల శ్రీను, గొలుసుపూడి రామారావు, దుర్గాడ గ్రామానికి చెందిన మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు తదితరులు పాల్గొన్నారు.