జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన కళ్యాణదుర్గం జనసేన

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, కంబదూరు మండలం కదిరి దేవరపల్లి గ్రామం జనసైనికుడు నవీన్ వాళ్ల తండ్రి పావగడ తాలూకా బుడ్డారెడ్డిపల్లి వద్ద జరిగిన యాక్సిడెంట్ లో రామ్మూర్తి మరణించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి రామ్మూర్తి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున రామ్మూర్తి భార్యకు 10,000 రూపాయలు ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగింది. అలాగే కుటుంబానికి ఎల్లప్పుడు అండగా జనసేన ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పరామర్శ కార్యక్రమానికి కంబదూరు మండలం అధ్యక్షులు చంద్రమౌళి ఆధ్వర్యంలో, జిల్లా కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కదిరిదేవరపల్లి వెంకటేష్, కార్తీక్ కురుబ, హరిప్రసాద్, నరసింహమూర్తి, తిమ్మాపురం నరేష్, శ్రీనివాసులు, భరత్, నరసింహ మూర్తి, గంగరాజు, మణి కుమార్, రమేష్, గోవిందరాజులు, గొల్ల నాగభూషణ, సురేష్, మణికంఠ, శ్రీనాథ్, సాయితేజ జూల, ఈరన్న, నయన్ తేజ, రాంప్రసాద్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.