రక్తదాన శిబిరం ఆవిష్కరణ పోస్టర్ ను విడుదల చేసిన కందుల దుర్గేష్

రాజానగరం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన మహోత్సవంలో భాగంగా ఈనెల 29న రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో జిల్లా స్థాయిలో రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే మహా రక్తదాన శిబిరం సంబంధించిన ఆవిష్కరణ(ఆహ్వానం) పోస్టర్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ ఆవిష్కరించడం జరిగింది. జిల్లా నాయకులు, రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్త ప్రసాద్ మరియు రాజనగరం జనసైనికుల మధ్యన ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ… రక్తదానం యొక్క ఆవశ్యకతను, అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్న అనేకమంది ప్రాణాలను కాపాడడం గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అత్యంత విజయవంతం చేయాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.