మీసాల రమణయ్యను పరామర్శించిన కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, జి.సిగడాం మండలం, నిద్దాం పంచాయతీ అద్దోనంపేట రోడ్డు విషయంలో అన్యాయంగా చేసిన పనికి నిద్దాం పంచాయతీ జనసేన పార్టీ సర్పంచ్ మీసాల రవికుమార్ మరియు జనసైనికులు వెళ్లి ప్రశ్నించగా వైసిపి దుండగులు వారిపై దాడి చేసిన దాడిలో మీసాల రవికుమార్ మరియు మీసాల రమణయ్య తీవ్రంగా గాయపడ్డారు. అయితే మీసాల రమణయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా విషయం తెలుసుకుని ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి.. ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిద్దాం జనసేన నాయకురాలు శ్రీమతి బుజమ్మ, నిద్దాం ఎంపీటీసీ బాలి అప్పలనాయుడు, జి.సిగడాం మండల నాయకులు మీసాల రామకృష్ణ, పొగిరి అప్పలనాయుడు, అనిల్ సందీప్రు, అలాగే బార్నల దుర్గారావు, కోలా రాజేష్, కాకర్ల బాబాజీ, నడుపురు శంకర్, బుజ్జి అలాగే జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.