జనసేనపార్టీ ఆవిర్భావ సభకు మద్దతు తెలిపిన కాపు సంక్షేమ సేన
పాలకొల్లు, మార్చి 14 వ తేదీన మచిలీపట్టణం వేదికగా జరగనున్న జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ సభకు కాపు సంక్షేమ సేన మద్దతు తెలియజేయడం జరిగింది. దీనికి సంబందించి పాలకొల్లులో మంగళవారం మాజీ ఎం.పి, ఆంధ్రప్రదేష్ మాజీ హోం మినిస్టర్ మరియు కాపు సంక్షేమ సేన చైర్మన్ చేగొండి హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన సభ్యులందరు జనసేన 10వ ఆవిర్భావ సభకు హాజరయి విజయవంతం చేయాలని ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-07-at-21.53.10-750x1024.jpeg)