బిట్రగుంట మల్లిక ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

గుంటూరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మంగళవారం గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సూచనల మేరకు జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు నేరేళ్ల సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లాలో ముఖ్య భూమిక పోషిస్తున్న వీర మహిళలను సన్మానించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ వీర మహిళల అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో జనసేన పార్టీలో క్రియాశీలకంగా వీర మహిళలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నిర్ణయం ప్రకారం ఏ కార్యక్రమం తలపెట్టినా మనమందరం కలిసికట్టుగా ఉండి విజయం సాధించాలని, అలాగే మన పార్టీలోకి నూతనంగా వీర మహిళలను తీసుకువచ్చి పార్టీకి అండగా ఉండే విధంగా ప్రతి ఒక్కరిని మనము కలుపుకొని వెళ్లాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని 2024లో సీఎంగా చూడాలని, వారిని సీఎంగా చేసే దాకా మనము నిద్రపోకుండా అహర్నిశలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోనీ పార్వతి, జిల్లా నాయకులు బడే కోమలి, తులసి కుమారి, రావి రామా, బంధనాల జ్యోతి, సోమరౌతు అనురాధ, పాకనాటి రమాదేవి, నగర కమిటీ సభ్యులు జి. మల్లేశ్వరి, ఆసియా, గడదాసు అరుణ, కవిత, కార్పోరేటర్ దాసరి లక్ష్మీ దుర్గ, మండల అద్యక్షులు తాడువాయి లక్ష్మి, రాజనాల నాగ లక్ష్మి, అనసూయ, రాజ్యలక్ష్మి, సుమలత, కమల, వాసంతి, వరలక్ష్మి, హరి సుందరి, ఉదయ్ లక్ష్మి, శివ మాణిక్యం, అల్లాడి శ్రీదేవి, రత్నకుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు.