కదం తొక్కిన కారిపాకం జనసైనికులు జనసేన నాయకులు!

సత్యవేడు నియోజకవర్గం: వరదయపాలెం మండలం, కారిపాకం పంచాయతీ మరియు గ్రామంలో జనసేన, టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధి కోనేటి ఆదిమూలం జనసేన, టిడిపి, బిజెపి పార్టీ నాయకుల అధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించి ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించడం పెట్టడం జరిగింది. అడుగు అడుగున కోనేటి ఆదిమూలంకి జననీరాజనాలు పట్టిన కారిపాకం మహిళలు, ప్రజలు, ప్రచార కార్యక్రమంలో ఉత్సాహం మూడు పార్టీల కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు అంబటి చిరంజీవి యాదవ్, ఉపాధ్యాక్షుడు తులసి రామ్, టి.ఎస్. శీరిష వరదయ్యపాలెం, మండల నాయకుడు కులశేఖర్ రెడ్డి, ప్రధానకార్యదర్శులు యంపళ్ళ వెంకటేష్, వసంత్ కుమార్, సంయుక్త కార్యదర్శులు ముణిరత్నం, ప్రసాద్, కార్యకర్తలు హరి బాబు, వెంకటేష్, వెంకటరమణ, సాయి కుమార్, బాలకృష్ణ, వెంకటేష్, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.