గాజులరేగలో బహిరంగ సభలో పాల్గొన్న శ్రీమతి పాలవలస యశస్వి

విజయనగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజులరేగలో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థిని పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మరియు పార్లమెంట్ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. శుక్రవారం గాజులరేగ “మెయిన్ రోడ్ సాయిబాబా గుడి వద్ద జరిగిన బహిరంగ సభ”లో మన జనసేన, తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు జనసైనికులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.