ఉద్యోగులకు కే‌సి‌ఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సి‌ఎం కే‌సి‌ఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పదవి విరమణ కాల పరిమితితో పాటుగా వేతన పెంపును కూడా పెంచాలని నిర్ణయించారు. అందుకోసం సి‌ఎం కార్యలయం నుండి ఓ ప్రకటన విడుదల చేసింది. సి‌ఎస్ సోమేష్ కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు.నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో అన్నీ శాఖల ఉద్యోగులు 9,36,976 మంది ఉంటారని అందరికి ప్రయోజనం కలిగేలాగా వేతనాలను పెంచాలని కే‌సి‌ఆర్ సూచించారు. తక్కువ వేతనంకు పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుల వేతనాలను పెంచాలని సూచించారు.

వేతనాలు పెంచడం వలన ఆర్టీసీ పై పడే భారం ప్రభుత్వమే భరిస్తుందని సి‌ఎం పేర్కొన్నారు. ఇక రిటైర్ అయ్యే ఉద్యోగులకు వీడ్కోలు పలకడంతో పాటుగా అన్నీ రకాల ప్రయోజనలు అందేలాగా చూడాలని కే‌సి‌ఆర్ ఆ శాఖలకు సంబందించిన అధికారులకు సూచించారు. అలాగే ఏయే శాఖలో ఖాళీలు ఉన్నాయో గుర్తించి ఫిబ్రవరి నుండి నియమకాలు చేబడుతామని వివరించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *