గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యుల కిట్ల పంపిణీ

పాలకొండ: జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో గురువారం చిన్న మంగళాపురం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులును ఉద్దేశించి మాట్లాడుతూ.. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల చేత ఓట్లు వేయించి జనసేన పార్టీ గెలుపుకు సహకరించాలని కోరారు.