కొమరాజు లంక గ్రామ రైతులకు అండగా ఉండి అక్రమ మట్టి తవ్వకాలను అరికడతాం – బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండలంలోని, కొమర్రాజు లంక గ్రామంలో కొన్ని రోజులుగా జరుగుతున్న మట్టి మాఫియా అక్రమ మట్టి తవ్వకాలు పై జనసేన పార్టీ గట్టిగా పోరాటం చేశారు, ఆ గ్రామ రైతులకు అండగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో, శుక్రవారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో, నాలుగు మండలాల జనసేన పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలతో కలిసి రావులపాలెం మండలం తాసిల్దారు వారికి వినతిపత్రం అందజేశారు. వెంటనే అరికట్టాలని రైతులకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరిగినా, వారి పంట భూములు దెబ్బతిన్నా ఊరుకోమని వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వో వారిని వినతిపత్రం ఇచ్చి కోరారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల అధ్యక్షులు తోట స్వామి, ఆత్రేయపురం మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, ఆలమూరు మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, కొత్తపేట మండల అధ్యక్షులు మరియు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు బొక్క ఆదినారాయణ, దొంగ సుబ్బారావు, మరియు జనసేన నాయకులు నంబూరు రవి, గాయత్రి ప్రసాద్, ఎర్రంశెట్టి రాము, భావన సూరిబాబు, కంఠంశెట్టి చంటి, గుర్రాల సతీష్, కృష్ణ, గిద వెంకటేష్ మరియు మండల కార్యకర్తలు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.