కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరణ

*యూత్ సమ్మిట్ ల ద్వారా యువత నైపుణ్యాలను మరింత మెరుగు పరుచుకోవాలి
*పోస్టర్ ఆవిష్కరణలో ఐటీ శాఖ మంత్రి లోకేష్

అమరావతి, ఉండవల్లి, అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న రాష్ట కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో రామచంద్రాపురంలో జరుగనున్న కోనసీమ యూత్ సమ్మిట్ పోస్టర్ ను బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న టాలెంట్ ను, స్కిల్స్ ను రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకునేందుకు కోన సీమ యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాలు దోహద పడతాయన్నారు. యువత తమ ఆలోచనలు వ్యక్తపరచడానికి యూత్ సమ్మిట్ సరి అయిన వేదికగా ఉపయోగపడుతుందని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అభివృద్ధి అజండాగా భవిష్యత్ ప్రణాళికలు చర్చించడంతో పాటు, యువత లోని నాయకత్వ లక్షణాలు, పరిస్థితులకు తగినట్లు వేగంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచన విధానాలను యూత్ సమ్మిట్ వంటి కార్యక్రమాల ద్వారా యువత అలవర్చు కోవాలని ఆయన సూచించారు. యువతకు ఎంతో ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమ నిర్వహణ కు నడుబిగించిన మంత్రి సుభాష్ ను ఈ సందర్బంగా ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. కేబినెట్ సమావేశానికి ముందు జరిగిన ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులైన నిమ్మల రామానాయుడు, ఆనం రాం నారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, అనగాని సత్య ప్రసాద్, రాం ప్రసాద్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

Share this content:

Post Comment