కేంద్రమంత్రి హర్షవర్థన్‌కు కేటీఆర్‌ లేఖ

కేంద్రమంత్రి హర్షవర్థన్‌కు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. జీనోమ్ వ్యాలీలో ప్రభుత్వ మెడికల్ స్టోర్ డిపో కూడా ఏర్పాటు చేయాలన్నారు. జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉందని గుర్తుచేశారు. 60 బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు తయారు చేస్తున్నాయని లేఖలో కేటీఆర్‌ పేర్కొన్నారు.