ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసే సమయం ఆసన్నమైంది: ఆదాడ మోహనరావు

విజయనగరం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలు తొందరలోనే కూల్చివేసే సమయం ఆసన్నమైందని జనసేనపార్టీ సీనియర్ నాయకుడు ఆదాడ మోహనరావు అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ సామజిక భవనంలో జనసేనపార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాడ మాట్లాడుతూ జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవంనాడు పార్టీ సభకు ఇప్పటం గ్రామస్తులు స్థలాన్ని ఇచ్చిన పాపానికి ఆగ్రామంలో నూట ఇరవై అడుగుల రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లుల్ని కూల్చి విధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామస్తులను శనివారం పరామర్శకు వెళ్ళినప్పుడు పవన్ ను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్ల మరామత్తుల కోసం ఈమధ్యనే గుడ్ మార్నింగ్ సిఎం కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెద్దయెత్తున చేశామని, రోడ్లపైన గుంతలు కప్పటం చేతగాని ప్రభుత్వానికి ఓ చిన్న గ్రామంలో కక్షపూరితంగా విధ్వంసం చేయడాన్ని రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని, కూల్చి వేతలతో ప్రారంభమైన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూల్చివేసే సమయం ఆసన్నమైందని దుయ్యబట్టారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు), పిడుగు సతీష్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్, ముక్కి కుమార్, పత్రి సాయికుమార్, చందక రాజారావు, చందక బుజ్జి, నవీన్, బెల్లాన పవన్ కుమార్, శేఖర్, ముక్కి విజయ్, విక్కి, అజయ్, వెంకటేష్ పాల్గొన్నారు.