అమరావతి రైతుల పాదయాత్రలో లాఠీఛార్జ్‌.. విరిగిన రైతు చేయి

వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చదలవాడ వద్ద రైతులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ క్రమంలో సంతనూతలపాడుకు చెందిన రైతు నాగార్జున చేయి విరిగింది. ఎప్పుడైతే పోలీసులు రాజధాని రైతులపై లాఠీ ఛార్జ్‌ చేస్తున్నారని చుట్టూ పక్కల గ్రామాలకు తెలిసిందో… ఆ చుట్టుపక్కల గ్రామాల నుండి రైతులు, ప్రజలు, మహిళలు సైతం వేల సంఖ్యలో వచ్చి అమరావతి రైతులకు మద్దతుగా నిలిచారు. పోలీసుల తీరుకు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు విధిస్తున్న ఆంక్షల నడుమే పాదయాత్ర సాగుతోంది.

former