కొవ్వూరు జనసేన ఆధ్వర్యంలో మహా పాదయాత్ర

కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం ప్రక్కిలంక వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు, ధర్మవరం గ్రామ అధ్యక్షులు కడిమి శీను బాబు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి గాయత్రి వెంకటేశ్వరరావు అధ్యక్షతన మహా పాదయాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనసేన సీనియర్ నాయకులు కొప్పాక విజయ్ కుమార్, తొర్లపాటి శీతల్, ఏడిద వీరరాఘవులు, సుభాషిని, ఉత్తమ రైతు పుప్పాల సత్యనారాయణ, పెద్దవం గ్రామ అధ్యక్షులు నామన చిన్న బురయ్య, మండల ప్రధాన కార్యదర్శి పెరుగు శివ, మండల సంయుక్త కార్యదర్శి కాపకాయల సతీష్ కార్యదర్శి, కొక్కిరపాటి పృథ్వి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది.