రోడ్లు వేయండి – ప్రజల ప్రాణాలు కాపాడండి

  • రాజాం జనసేన ఆధ్వర్యంలో మహాదీక్ష

రాజాం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో “రోడ్లు వేయండి- ప్రజల ప్రాణాలు కాపాడండి” అనే నినాదంతో రాజాం నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై, రాజాం నియోజకవర్గ నాయకులు ఎన్నిరాజు మరియు జనసైనికులు ఆధ్వర్యంలో గురువారం ఒకరోజు మహాదీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్నిరాజు మాట్లాడుతూ… నియోజకవర్గంలోని ప్రధాన రహదారి అయినటువంటి రాజాం – పాలకొండ రోడ్డు చాలా అద్వానంగా ఉందనీ, ఈ రోడ్డు మీద ప్రయాణం ప్రజలకు నరకంప్రాయంగా మారిందినీ, ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు బాగు కోసం నిధులు కేటాయించాము అని స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే చెబుతున్నా, ఆచరణలో మాత్రం ఎలాంటి పనులు చేపట్టలేదనీ, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టి అలాగే నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని రోడ్లు కూడా బాగు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని, లేనిపక్షంలో రాజాం జనసేన పార్టీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది. ఈ మహాదీక్షకు రాజాం చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే స్థానిక బిజెపి నాయకులు కూడా ఈ దీక్షకు తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ దీక్షలో ఎచ్చెర్ల నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, ఆమదాలవలస నియోజకవర్గ కొల్లివలస ఎంపీటీసీ అంపిలి విక్రాంత్, పాలకొండ నియోజకవర్గం జనసైనికులు, రాజాం బిజెపి నాయకులు మహిళా కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.