#GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో ప్రభుత్వాన్ని నిలదీయండి: పిడుగురాళ్ల జనసేన

పిడుగురాళ్ల: #GoodMorningCMSir కార్యక్రమ నిర్వహణ నిమిత్తం కార్యకర్తల సమావేశం మరియు పోస్టర్ ఆవిష్కరణ ను పిడుగురాళ్ల మండల పార్టీ ఆఫీస్ నందు, మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, వీరు మాట్లాడుతూ.. ఈ మూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో జనసైనికులు అందరూ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్ధతను ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా.. ప్రభుత్వానికి కనువిప్పు అయ్యేలా.. అద్వానంగా ఉన్న రోడ్లని సోషల్ మీడియా వేదికగా.. ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు, ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు సింగంశెట్టి రమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు సలీం, చీదెళ్ళ రాము, బయ్యవరపు రమేష్, బేతంచర్ల ప్రసాద్, గుర్రం కోటేశ్వరరావు,కోసూరి శ్రీకాంత్,షేక్ వలి, సాంబా, మొదలవారు పాల్గొన్నారు.