రాజకీయ విప్లవం వారాహి యాత్ర ను విజయవంతం చేయండి

ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు అవ్వండి అంటూ నెల ఈ 14వ తేదీ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి నుంచి ప్రారంభం అవుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్థానం నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అతని అనుచరులతో శబరి రామ క్షేత్రం వద్ద 108 టెంకాయలు కొట్టి పూజలు జరిపి పోస్టర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
▪️ చారిత్రాత్మక ఘట్టంలో అందరూ భాగస్వాములు అవ్వాలని జవాబుదారీతనం కోరుతూ సాగుతున్న జనసేన ప్రభుత్వం స్థాపించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి.
▪️ రాజకీయాల్లో కొత్త ఒరవడి సామాన్యుడి సమస్యకు అండగా నిలబడి వారికి సహాయం చేసి ప్రశ్నించగల గొంతును గెలిపించాల్సిందిగా కోరారు.
▪️ రాజకీయాలను పెట్టుకొని ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా, వర్గాలుగా విడదీసి దోచుకు తింటున్న రాజకీయ నాయకులకు సరైన సమాధానం చెప్పాలి.
▪️ ఒక వ్యక్తిగానే ఎంతో మందికి ఆపన్న హస్తము అందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించి అనిస్చితితో ఉన్న ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి రంగంలో నడిపించాలి.
▪️ ప్రజా శ్రేయస్సు కోసం పదేళ్లుగా ఆటుపోటులను ఎదుర్కొని నిలబడిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తోడుగా జనసేన నాయకులు వీర మహిళలు జనసేన మద్దతు దారులు మెగా అభిమానులు తరలిరావాలి.
▪️ 14 తేదీ నుండి జరుగుతున్న వారాహి ప్రయాణం నిర్విఘ్నంగా సాగాలని ప్రజా సమస్యలు తీర్చేందుకు వస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ ని ఆదరించండి.
▪️ ఈ ఉప్మా ముఖ్యమంత్రి రాక్షస పాలన నుండి కాపాడేందుకు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి అని పిలుపు నిచ్చారు.
ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వర్షన్, షాజహన్, హరి, మౌనేష్, హేమచంద్ర యాదవ్, బాలు, సాయి, షారు, సాయి, ఖాషిఫ్ తదితరులు పాల్గొన్నారు.