బలిజల ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చెయ్యండి

మదనపల్లి: జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, మదనపల్లె జనసేన నాయకులు మొరుంపల్లి అశ్వత్, శ్రీనాథ్ రాయల్ శివాజీ నగర్ లో సమావేశమై 5వ ఎలెక్షన్ వార్డ్ లో ఉన్న బలిజ సోదరులను మరియు అక్కచెల్లెమ్మలను కలిసి 14.04.2024 ఆదివారం జె సీఎం కమ్యూనిటీ హాలు నందు జరగబోవు బలిజల ఆత్మీయ సమావేశానికి హాజరు అయ్యి జయప్రదం చేయాలని ఆహ్వానించడం జరిగింది. దీనికి అక్కడున్న బలిజలు ఏర్రమ్మ, అశోక్, మోహన్, శ్రీరామ నాగరాజ, అనిల్, కాకర్ల నాగరాజ, కట్టా గంగాధర్, వెంకటరమణ, సిద్దరాం లక్ష్మీదేవి, రమణమ్మ సమావేశానికి హాజరు అవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు.