జనసైనికుడు కరెడ్ల సత్తిబాబును పరామర్శించిన మాకినీడి దంపతులు

పిఠాపురం: గొల్లప్రోలు పట్టణంలో 11వ వార్డు కరణం గారి తోటలో జనసైనికుడు కరెడ్ల సత్తిబాబు కొంతకాలంగా కాళ్ళు నొప్పితో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు వారి హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ వారిని పరామర్శించి వారి రిపోర్ట్లు పరిశీలించి, వారి ఆరోగ్య పరిస్థితి అడిగి అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం వ్యాధికి సంబంధించిన డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ అమ్మజి, శిరీష, నవీన్, కర్రెడ్ల సత్తిబాబు, తాతారావు, తాతాజీ, కుట్టి, ఉలవశెట్టి శ్రీను, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.