ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 26వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కుమ్మరి మిట్ట గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 26వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని కుమ్మరి మిట్ట గ్రామంలో జనసేన పార్టీ నాయకులు కరపత్రాలు పంచుతూ కార్యక్రమంలో కొనసాగగా, గ్రామస్థులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా మా గ్రామ అభివృద్ధి నోచుకోవడం లేదు, మా గ్రామ పరిస్థితిని వివరిద్దమన్న వినే నాయకులే లేరు అని తెలిపారు. మనుబోలు గణపతి మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకి ఉపాధి అవకాశాలు, గ్రామ అభివృద్ధి జరుగుతుందని, నిత్యావసర ధరలు తగ్గుతాయని, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు కు ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కత్తి భాను ప్రకాష్, తాండ్ర శ్రీను పాల్గొన్నారు.