Vizag: ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం కృషిచేస్తా – సంకు వెంకటేశ్వరరావు

జనసేన పార్టీ ప్రజలకు చేరువయ్యేలా నిరంతరం కృషిచేస్తానని జనసేన నాయకుడు సంకు వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన సంకు వెంకటేశ్వరరావు గురువారం పార్టీ అగ్ర నేతల ఆహ్వానం మేరకు పార్టీ కార్యాలయానికి విచ్చేసారు. కార్యాలయానికి విచ్చేసిన సంకుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, తమ్మిరెడ్డి శివశంకర్, బొలిశెట్టి సత్యనారాయణలు పుష్పగుచ్చంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాట్లాడుతూ సంకు వంటి నిఖార్సయిన వ్యక్తి తమతో కలిసి పనిచెయ్యడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. సంకు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను, విధివిధానాలను తూచా తప్పకుండా పాటిస్తానన్నారు. నగరంలో పార్టీ అభివృద్ధికి, జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవిధంగా పాటుపడతాననని తెలిపారు. జనసేన సీనియర్ నాయకుడు వన్నెఒరెడ్డి సతీష్, 50 వ వార్డు జనసేన అధ్యక్షుడు మురళి మరియు సంతోష్ రెడ్డి, ఎల్లాజీ రావు, మధు, శంకర్, డాక్టర్ రాము, పల్లా శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంకుకు స్వాగతం పలికారు.