మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలి: ఇమ్రాన్ ఖాన్ ట్వీట్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ట్వీట్ చేశారు. కరోనా బారిన పడిన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఇమ్రాన్ఖాన్ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ కూడా ఇటీవల కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే.