యువశక్తి పోస్టర్ ను ఆవిష్కరించిన మనోజ్ కుమార్ రాయల్

జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో గురువారం జరగనున్న యువశక్తి కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించి, జనసేన పార్టీ ఈ కార్యక్రమం ఎంత బాధ్యతగా తీసుకుందో వివరించి రాయలసీమ సమస్యల మీద, కడప జిల్లా సమస్యల మీద మాట్లాడే యువకులను ఆహ్వానించారు. మన యువత – మన భవిత అనే నినాదాన్ని తీసుకున్న అధ్యక్షుడి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రైల్వే కోడూరు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కొండేటి మనోజ్ కుమార్ రాయల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కొండేటి భాస్కర్, బాలు, రూతేష్, సురేష్, గణేష్, అరవింద్, సుమంత్ తదితరులు పాల్గొన్నారు.