మత్స్యకార అభ్యున్నతి యాత్ర మహాసభకు సంఘీభావంగా విజయవాడ తూర్పు జనసేన

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఆదివారం 20వ తారీకున నర్సాపురంలో జరుగుతున్న మత్స్యకార అభ్యున్నతి యాత్ర మహాసభకు సంఘీభావంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జనసేన మత్స్యకార యువ నాయకులు చక్కా రామయ్య, పోనాల గంగరాజు మరియు నాయకులు కరిమికొండ శివరామ కృష్ణ, సుంకర రామకృష్ణ ల ఆధ్వర్యంలో కృష్ణా నది ఒడ్డున పెద్ద ఎత్తున నివశిస్తున్న మత్స్యకార కుటుంబాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని వారికి చలో నర్సాపురం కార్యక్రమం గురుంచి తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎన్నమనేని కృష్ణ, పఠాన్ షబ్బీర్, సుంకర లక్ష్మణ్, ఆంజనేయులు, బాల కోటయ్య, వాసు, సాయి, అంజి తదితురులు పాల్గొన్నారు.