వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జనసేనలో భారీ చేరికలు

విశాఖ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా, జనసేన విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జనసేనలో భారీ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా పార్టిలో చేరినవారు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని వెల్లడించారు. త్వరలో విశాఖలో మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ యాదవ్ తెలిపారు. సోమవారం ప్రముఖ హోటల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు పవన్ కళ్యాణ్ చేతుల మీదగా, జనసేన విశాఖ నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో అధిక సంఖ్యలో చేరారు. పార్టీలో చేరిన వారిలో ప్రస్తుత కనకమాలక్ష్మి బోర్డ్ మెంబర్ మాజీ కార్పొరేటర్ బుద్దల అనురాధ, మాజీ కార్పొరేటర్ గుల్లిపల్లి ఆనందరావు, మాజీ కౌన్సిలర్ సాలూరు నియోజకవర్గం గుమ్మ నాగార్జున, వైఎస్ఆర్సిపి తూర్పు సీనియర్ నాయకులు బొబ్బిలి రవికుమార్, వైసీపీ విశాఖ నగర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కర్రి ప్రసాద్, ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోసూరు శ్రీనివాసరావు, వైసీపీ ఎనిమిదవ వార్డు మాజీ అధ్యక్షులు సుంకర హరిబాబు, 26వ వార్డు మాజీ వైసీపీ అధ్యక్షులు పొట్నూరు సత్యనారాయణ, వైసీపీ విశాఖ నగర జాయింట్ సెక్రెటరీ కండిపిల్లి శ్రీధర్, భీమిలి నియోజకవర్గ సోషల్ మీడియా కో-కన్వీనర్ సీరపు వంశీ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త పిల్లా బాబ్జి పార్టీలో చేరారు.