కాకినాడ రూరల్ జనసేనలో భారీ చేరికలు

కాకినాడ రూరల్: మండలంలోని రమణయ్యపేట, ఈశ్వర్ నగర్ రెల్లి వీధి వైసీపీకి చెందిన యువత, జనసేన నాయకులు పండు నాయుడు ఆధ్వర్యంలో సుమారు 50 మంది దనాల రాం ప్రసాద్, సోమదుల బుజ్జి, మాడుగుల రామారావు, నీలాపు ప్రకాష్ నాయకత్వంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానం పలికారు.. ఈ కార్యక్రమంలో భాగంగా డి రామ్ ప్రసాద్, దుర్గా ప్రసాద్, పి వీరబాబు, ఎస్ రాజశేఖర్, డి రాజేష్, కె ప్రసాద్ ఎన్న్ సత్తిబాబు, ఎస్ సురేష్, ఎస్ కమల్, బి. శంకర్, ఎస్ బుజ్జి, ఎమ్మ్ రామారావు, ఏ వంశీ కృష్ణ, బి దేవి కుమార్, ఎన్న్ జగదీష్, ఎన్న్ ప్రకాష్, డి వెంకట్, పి ప్రసాద్, ఎస్ వెంకటేష్, డి తరుణ్ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తాటికాయల వీరబాబు, రమణయ్య పేట గ్రామ అధ్యక్షులు జగన్, జిల్లా కార్యదర్శి సోదే ముసలయ్య, రమణయ్య పేట ఉపాధ్యక్షులు తురగా సంతోష్, మండల కార్యదర్శి గేదల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.