ఖమ్మంలో మేయర్, కలెక్టర్ సైకిల్ పర్యటన

ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఖమ్మం మేయర్ పాపాలాల్ , జిల్లా కలెక్టర్ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి ఈ ఉదయం సైకిల్ పై పర్యటించారు.

ఖమ్మంలోని అన్ని ప్రధాన రహదారులు విస్తరించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని రోడ్డుకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని ఆదేశించారు.

రోడ్డుపై అడ్డుగా ఉన్న విద్యుత్ ట్రాన్సఫార్మేర్లు, వినియోగంలో లేని స్తంభాలు తొలగించాలని విద్యుత్ ఎస్ఈ ని ఆదేశించారు. 19, 20, 24, 25, 33, 32, డివిజన్లలో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడారు.