అగ్నిప్రమాద బాదితులకు అండగా నిలచిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటి గ్రామం హరిజన పేటకు చెందిన బర్ల వెంకట్రావు ఇంటికి నిప్పు అంటించిన గుర్తుతెలియని వ్యక్తులు చేసిన పని ఈ పేద కుటుంబం రోడ్డున పడింది. అని కోటి జనశ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని ఓదార్చి ఒక నెలకి సరిపడే నిత్య అవసర సరుకులు, బాధితులకు బట్టలు, 5,000 రూపాయలు నగదు జనసేన పార్టీ తరుపున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి గ్రామం జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు నాగు, చదువు ముక్తేశ్వరరావు, గణశాల ఏసుబాబు, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, తెలగంశెట్టి శివ, రాయపాటి హరీష్, రాయపాటి సూరిబాబు, రాజానగరం మండలం నాయకులు మెడిద వీరబాబు, నందికం శేషాగిరి గ్రామస్తులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.