మండపాక మురళిని పరామర్శించిన మేడ గురుదత్

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, మునగాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు మండపాక మురళి అనారోగ్యనికి గురై డెల్టా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని విషయం తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారిని పరామర్శించి, డెల్టా సిబ్బందితో మురళి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శశ్రీను, చల్లా ప్రసాద్, మండపాక అశోక్ తదితరులు పాల్గొన్నారు.