ఘనంగా మెగా రక్తదాన శిబిరం

ఎమ్మిగనూరు, మెగా అభిమానులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 38వ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అఖిల భారత చిరంజీవి యువత మరియు రాష్ట్ర రాంచరణ్ యువశక్తి పిలుపు మేరకు ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తాలూకా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ రక్తదాన శిబిరానికి సహకరించిన 60 మందికి, ప్రతి ఒక్క మెగా అభిమానికి జనసైనికులకి, నాయకులకి ధన్యవాదాలు తెలిపారు. ఇలాగే తమ అభిమాన మెగా హీరోలు అడుగుజాడల్లో నడుస్తామని రాబోయే రోజుల్లో మెగా హీరోల స్ఫూర్తితో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు జనసైనికులు బజారి మల్లికార్జున శివ నేతు అంజి జనసేన నాయకులు మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.