మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

అశ్వారావు పేట: పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మంగళవారం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా అధ్యక్షుడు కాసిం మెగా రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు దేవా గౌడ్, బాలాజీ, భాష మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాసిం కు అభిమానుల అందరి తరఫున అభినందనలు తెలిపారు.