రఘు కుంచె కూతురి పెళ్లిలో మెగా సందడి

అక్టోబర్ 29న ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచె కూతురు రాగ పుష్యమి వివాహం ఆశిష్ వర్మతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా పెళ్లి వేడుకకు హాజరు కాగా, ఆయన నూతన దంపతులకి పుష్ప గుచ్చం ఇచ్చి ఆశీర్వదించారు.

తన కూతురి పెళ్ళి వేడుకకి చిరంజీవి హాజరైన విషయాన్ని రఘు కుంచె రీసెంట్‌గా తెలియజేశారు. తన సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.