ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు కువైట్, నందలూరు జనసేన అండ

రాజంపేట నియోజకవర్గం: ఊటుకూరులో ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడి ఆర్ధిక భారాన్ని మోయలేక సాయం అర్జించిన కొడిదెల తిరుపాలమ్మకు జనసేన పార్టీ కోవైట్ సభ్యులు, నందలూరు జనసైనికులు 42,000 రూపాయల ఆర్థిక సహయాన్ని అందజేసారు. ఈ కార్యక్రమానికి అతికారి దినేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసారు. అనంతరం ఊటుకూరు జనసైనికుడు అనిల్ కుమార్ గాయాలపాలవడంతో అతనిని కలిసి 10,000 రూపాయలను రాజంపేట, నందలూరు జనసేన పార్టీ సభ్యులతో కలిసి జనసేన పార్టీ కువైట్ సభ్యులు ఆర్ధిక సాయం చేయడం జరిగింది. ఈ సహాయాన్ని రాష్ట్రకార్యదర్శి ముఖరం చాంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన, రాజంపేట యువనాయకులు అతికారి దినేష్ ఆధ్వర్యంలో అభాగ్య కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కత్తి సుబ్బరాయుడు, కోలాటం హరి, పోలిశెట్టి శీను, కొండల రవి, గుగ్గిల నాగార్జున, బెల్లంపల్లి శ్రీనివాస్, వీరయ్య ఆచారి, హేమంత్, చిన్న, జానీ తదితరులు పాల్గొన్నారు.