జనసేన పార్టీలో చేరిన విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు

రాజానగరం నియోజకవర్గం: జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్యర్యంలో రాజానగరం నియోజకవర్గం (దివాన్ చెరువు గ్రామంలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర విశ్వబ్రాహ్మణ సంఘానికి చెందిన 30 కుటుంబాలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనంలో జనసేన పట్ల నమ్మకం. బత్తుల బలరామకృష్ణ నాయకత్వమంటే విశ్వాసం రోజురోజూకీ పెరుగుతుందనడానికి ఇదే గొప్ప ఉదాహరణ. కులప్రస్తావన లేని రాజకీయం జనసేన మాత్రమే చేయగలదు. అనే అంశాన్ని జనం ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో భవిష్యత్తు బంగారంలా మారుతుందనే ధ్రుడనమ్మకం జనాన్ని వందలు, వేలుగా జనసేన పార్టీ వైపు మరలిస్తోంది. పార్టీలో జాయిన్ అయిన వారిలో వంగర బాబూరావు, బొమ్మకంటి శ్రీనివాసు, నక్క బుజ్జి, సామోజు అప్పలాచారి, బొమ్మకంటి పెద్ద వీరబాబు, బొమ్మకంటి చిన్న వీరబాబు, అగర్తి సత్యనారాయణ, వాసాబత్తుల నానాజి, సామోజు లక్ష్మణరావు, వీరమల్లు రాజు, గౌరిపట్టపు అన్నవరం, గౌరిపట్టపు బ్రహ్మం, కొమ్మోజు పూర్ణ, ద్వారపూడి రాజు, ఆవుపాటి ఈశ్వరరావు, ఆవుపాటి సూర్యనారాయణ, వెర్లిపూడి శ్రీను, బలగం రాంబాబు, రాయపాటి మణికంఠ, మత్తుర్తి ఆదినారాయాణ, మత్తుర్తి శ్రీను, పట్నాల దుర్గారావు (సూర్యారావు పేట), నక్కా గోపిచంద్, చంటి సెల్ షాపు పూట్ట చంటి, శ్రీను సెల్ షాపు పూట్ట శ్రీను, పూట్ట కృష్ణ, కామిజె బలరాజు మరియు ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.