జనసేన కేలండర్లను ఆవిష్కరించిన అగురు వినోద్ కుమార్

చీపురుపల్లి నియోజకవర్గం: మెరకముడిదాం మండలం, భైరిపురం గ్రామంలో మాజీమంత్రి వర్యులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీమతి పడాల అరుణమ్మ సహాయం చేసిన 100 కేలండర్లను నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ నూతన సంవత్సర కేలెండర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సాసుబిల్లి రామారావు, రెడ్డి రామకృష్ణ, మంత్రి చిన్నారావు పాల్గొన్నారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ 2024లో జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా గెలుపే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు.