పోలీసు అమరవీరులకు మోడీ, అమీత్ షాలు ఘన నివాళి

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వీర పోలీసులకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమీత్ షాలు ఘన నివాళులర్పించారు.. ఢిల్లీలోని అమర పోలీసుల స్మారక స్థూపం వద్ద మోడీ పుష్పగుచ్చాలను ఉంచి అంజలి ఘటించారు.. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నివాళులర్పిస్తూ ట్విట్టర్‌ ద్వారా పోస్టు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణ, సంక్షేమ కార్యక్రమాల్లో పోలీసులు ముందు వరుసలో ఉంటారన్నారు. ప్రకృతి విలయం సమయంలోనూ అందరికంటే ముందుండి పోలీసులు సేవ చేస్తారన్నారు. ఇలా ప్రతి సంక్షోభంలో ముందుండడంలో కొందరు అమరులయ్యారని వారికి నివాళులర్పిస్తున్నాని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.