రోహ్ తంగ్ లో అటల్ టన్నెల్ ప్రారంభించిన మోదీ

హిమాచల్ ప్రదేశ్ లోని రోహ్ తంగ్ లో అటల్ టన్నెల్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గమిది. టన్నెల్ పొడవు 9.2 కిలోమీటర్లు. ఎనిమిది మీటర్లు. ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాన్ని కల్పించారు. సముద్ర మట్టానికి పదివేల అడుగుల ఎత్తున ఈ టన్నెల్ ను నిర్మించారు. ప్రతి కిలోమీటర్ కు గాలి నాణ్యతను కొలిచే పరికరాన్ని ఏర్పాటు చేశారు. మనాలి – లేహ్ ల మధ్య 46 కిలోమీటర్లను ఈ సొరంగ మార్గం తగ్గించనుంది. ఈ టన్నెల్ కు అప్పట్లో వాజ్ పేయి శంకుస్థాపన చేశారు. 2019 డిసెంబర్ లో ఈ టన్నెల్ కు అటల్ బిహారీ వాజ్ పేయి పేరు పెట్టారు.