జనసేనానిని సన్మానించిన విక్రమ్
మంగళగిరి: గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళగిరి పార్టీ ఆఫీసులో సిక్కోలు జిల్లా ఏకైక ఎంపీటీసీ విక్రమ్ పవన్ కళ్యాణ్ ను మర్యాద పూర్వకంగా కలిసి నాకు పునర్జన్మ ఇచ్చారు అని శాలువాతో సన్మానం చేశారు. అంతేకాక భవిష్యత్ లో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి జనసేన తరుపున ఒక ఎమ్మెల్యేని కూడా మీకు బహుమతిగా ఇస్తాం అని కళ్యాణ్ కు తెలియచేశారు. మన గెలుపుకి కారణం అయిన మన జనసేన నాయకులు మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు అని అధినేత కి తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విక్రంతో మీరు గెలిచనందుకు సంతోషగా ఉంది, ఇది వరకు కూడ మీకు చెప్పాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గం వస్తా కలిసి పని చేద్దాం అని, మీకు నేను అండగా ఉంటా అని కొండంత భరోసా విక్రమ్ కు ఇచ్చారు..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/hh-2-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-27-at-4.11.58-PM-1-682x1024.jpeg)