భవానిల పాదయాత్రను ప్రారంభించిన శ్రీమతి బత్తుల

రాజానగరం: కోరుకొండ మండలం, బూరుగుపూడి గ్రామంలో భవాని దీక్ష తీసుకున్న యువకులు గురువారం బూరుగుపూడి గ్రామం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వరకు నడుచుకుంటూ వెళ్ళుటకు భవానీలు తలపెట్టిన పాదయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో – ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బూరుగుపూడి జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.