రాఘవపురంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం రాఘవపురం గ్రామంలో బుధవారం పలు కుటుంబాలను జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. ముందుగా గ్రామంలో యడ్ల పైడమ్మ ఇటీవల స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. యాళ్ళ రఘుపతమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు కాళ్ళకి గాయం అయిందని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గుల్ల సురేష్ కు ఇటీవల యాక్సిడెంట్లో కాళ్ళకి గాయం అయిందని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చిన్నం ముసలయ్య అల్లుడు ఇటీవల మృతి చెందినారని తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. యల్లంకుల వెంకటలక్ష్మి ఇటీవల స్వర్గస్తులైనారు.. నేడు పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం తెలిపారు. కోరం సత్యనారాయణ ఇటీవల స్వర్గస్తులైనారు.. వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.