ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు

వేమూరు నియోజకవర్గం: వేమూరు మండలం, జంపని గ్రామంలో వేమూరు మండల ఎం.ఆర్.పి.ఎస్ కన్వీనర్, కో.కన్వీనర్ ఆలపాటి రాకేష్, పులివర్తి ఎలీషా ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజక వర్గం ఎం.ఆర్.పి.ఎస్ ఇంఛార్జి వై. దాసు మాదిగ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాసు దేవ గౌడ, వేమూరు నియోజకవర్గం కాపు నాయకులు బ్రహ్మం, వేమురు మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అంకమరావు యాదవ్, జంపని గ్రామస్తులు చుండూరు సత్యం, అనిల్, ఇమ్మాన్యూల్, కిరణ్, వంశీ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.