పలువురి బాధితులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన శ్రీమతి బత్తుల

కోరుకొండ మండలం, కోటి కేశవరం గ్రామానికి చెందిన నక్కపల్లి ప్రవీణ్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకొన్న బత్తుల వెంకటలక్ష్మి వారి ఇంటి వద్ద ప్రవీణ్ ను పరామర్శించి, ప్రస్తుత పరిస్థితులు తెలుసుకొని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి 5000/- రూపాయల ఆర్థిక సాహయం చేయడం జరిగింది. అదే గ్రామానికి చెందిన తాడిపాక రవి డయాలసిస్ కారణంగా బాధపడుతూ ఉండగా విషయం తెలుసుకుని వారి ప్రస్తుతం ఆరోగ్య విషయంలో డాక్టర్లు సూచించిన విధానం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వీరి వెంట పాల్గొన్నవారు వాకపల్లి రాజు, జల్లూరి ఏసు, దాసరి మని బాల రాంబాబు, లావేటి రాముడు, ములపర్తి సుబ్బారావు, పెద్ద కొండ రామలక్ష్మణులు మరియు నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.