57 పరుగుల తేడాతో ముంబై ఘన విజయం
IPL 2020 లో భాగంగా మంగళవారం రాత్రి ఆడిన 20వ మ్యాచ్లో రాజస్థాన్పై ముంబై 57 పురుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ సమిష్టి కృషితో రాణించగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు మెుత్తం సమిష్టిగా విఫలమై ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ముందు టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (79) అద్భుత ఇన్నింగ్స్కు తోడు బౌలర్లు, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా చెలరేగిపోవడంతో ముంబై ఖాతాలో మరో విజయం పడింది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచి 8 పాయింట్లతో మెరుగైన రన్రేట్ కారణంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 193 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే 136 పరుగులకు ఆలౌటై హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.