పారిశుధ్య కార్మికులకు అండగా మైలవరం జనసేన

మైలవరం, రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజుకి చేరింది. అందులో భాగంగా మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీ పారిశుద్య కార్మికులు ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వారు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) పాల్గొని జనసేన పార్టీ తరపున మద్దతు ప్రకటించారు. గాంధీ మాట్లాడుతూ కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో జనం అంత ఇళ్లకే పరిమితమైనప్పుడు వీధులు శుభ్రం చేస్తూ పారిశుధ్య కార్మికులు చేసిన త్యాగాన్ని ఆరోజు మనం పూలదండలతో సత్కరించి, కాళ్ళకి దండాలు పెట్టి ఈరోజు వారి సమస్యలను గాలికి వదిలేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తూ, భవిష్యత్తులో వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని, వారికి రావాల్సిన జీతాలు, అలవేన్స్ వారికి ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని జనసేన పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాబోవు రోజుల్లో పారిశుద్ధ కార్మిలకు అండగా ఉంటూ వారితో కలిసి పోరాటం చేసి వారి న్యాయపరమైన డిమాండ్లు సాధించే దిశగా వారికి తోడుగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యర్రంశెట్టి నాని, నాగబాబు, యతిరాజుల ప్రవీణ్, రామిశెట్టి ప్రవీణ్, యర్రంశెట్టి సాయి, అరిగే కళ్యాణ్, సామల సుజాత, సిరిపురం సురేష్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.